తాజా ఆంక్షలు యుద్ధ చర్యలే: ఉత్తర కొరియా
- December 24, 2017
బీజింగ్ : ఐక్యరాజ్య సమితి తాజాగా విధించిన ఆంక్షలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియాపై సమితి కక్షగట్టిందని ఆ దేశం ఆరోపించింది. సమితి తీసుకున్న తాజా ఆంక్షలు యుద్ధ చర్యలుగానే పరిగణించాల్సి వస్తోంది అని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేసే ఎత్తుగడలను ఉత్తర కొరియా ఏ మాత్రం క్షమించదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆంక్షలకు కారణమైన, వాటిని సమర్థించిన దేశాలన్నీ యుద్ధాన్ని కోరుకుంటున్నట్లుగానే ఉన్నాయని తెలిపింది. యుద్ధమే పరిష్కారమైతే అందుకు తగ్గ ఫలితాలను ఆయా దేశాలు అనుభవిస్తారని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ మధ్యే ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడంతో.. ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక ఆంక్షలు విధించింది. అందులో ప్రధానంగా... శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధం విధించారు. దీంతో ఉత్తర కొరియా 90 శాతం పెట్రో ఉత్పత్తులను కోల్పోయింది. అంతేకాక ఆహార ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్ పరకరాలపై నిషేధాలను విధించారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







