నుగ్ర లో మద్యం కర్మాగారం నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు 27 మద్యం పీపాలతో పట్టివేత
- December 27, 2017
కువైట్ : సారా పై సంపాదన మించింది లేదని ఓ ముగ్గురు ప్రవాస భారతీయులు ఏకంగా మధ్య కుటీర పరిశ్రమని స్థాపించారు.హవల్లి కమాండ్ నుండి భద్రతా సిబ్బంది నగ్రా ప్రాంతంలో ఒక స్థానిక మద్యం కర్మాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని నడుపుతున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. " మా గల్ఫ్ డాట్ కామ్ " నివేదిక ప్రకారం, అధికారులు 27 పీపాలతో సహా నిషేధించిన మద్యం తయారీలో ఉపయోగించిన సామగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. హవాల్లీ సెక్యూరిటీ చీఫ్ అబిడేన్ అల్-అబిదీన్ మాట్లాడుతూ మద్యం తయారీదారుల ముగ్గురు ఈ కర్మాగారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకొంది. దాంతో వీరిపై నిఘా పెట్టిన గూడాచారుల బృందం సమాచారం యొక్క ప్రామాణికతను నిర్ధారించేందుకు వారిపై నిఘా పెట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి ఆ కర్మాగారం శోధన మరియు అరెస్ట్ వారెంట్ పొందిన అనంతరం అధికారులు తగిన సమయంలో ఏకకాలంలో అపార్టుమెంట్లు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ నిందితులు విచారణ సమయంలో తమ నేరం అంగీకరించారు, వారు తయారుచేసిన నిషిద్ధ మద్యం తమ వినియోగదారులకు పంపిణీ చేసినట్లు వారు ఒప్పుకొన్నారు. దీంతో వీరిని చట్టబద్దమైన చర్య కోసం సంబంధిత అధికారులను సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









