నుగ్ర లో మద్యం కర్మాగారం నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు 27 మద్యం పీపాలతో పట్టివేత

- December 27, 2017 , by Maagulf
నుగ్ర లో మద్యం కర్మాగారం నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు  27 మద్యం  పీపాలతో పట్టివేత

కువైట్ :  సారా పై  సంపాదన మించింది లేదని ఓ ముగ్గురు ప్రవాస భారతీయులు ఏకంగా మధ్య కుటీర పరిశ్రమని స్థాపించారు.హవల్లి కమాండ్ నుండి భద్రతా సిబ్బంది నగ్రా ప్రాంతంలో ఒక స్థానిక మద్యం కర్మాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని నడుపుతున్న ముగ్గురు భారతీయులను  అరెస్టు చేశారు. " మా గల్ఫ్ డాట్ కామ్ " నివేదిక ప్రకారం, అధికారులు 27  పీపాలతో సహా నిషేధించిన మద్యం  తయారీలో ఉపయోగించిన సామగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. హవాల్లీ సెక్యూరిటీ చీఫ్ అబిడేన్ అల్-అబిదీన్  మాట్లాడుతూ మద్యం తయారీదారుల ముగ్గురు ఈ కర్మాగారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకొంది. దాంతో వీరిపై నిఘా పెట్టిన గూడాచారుల బృందం సమాచారం యొక్క ప్రామాణికతను నిర్ధారించేందుకు వారిపై నిఘా పెట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి ఆ కర్మాగారం శోధన మరియు అరెస్ట్ వారెంట్ పొందిన అనంతరం అధికారులు తగిన సమయంలో ఏకకాలంలో  అపార్టుమెంట్లు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన  ముగ్గురు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ నిందితులు  విచారణ సమయంలో తమ  నేరం అంగీకరించారు, వారు తయారుచేసిన నిషిద్ధ మద్యం తమ వినియోగదారులకు పంపిణీ చేసినట్లు వారు ఒప్పుకొన్నారు. దీంతో వీరిని చట్టబద్దమైన చర్య కోసం సంబంధిత అధికారులను సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com