నుగ్ర లో మద్యం కర్మాగారం నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు 27 మద్యం పీపాలతో పట్టివేత
- December 27, 2017
కువైట్ : సారా పై సంపాదన మించింది లేదని ఓ ముగ్గురు ప్రవాస భారతీయులు ఏకంగా మధ్య కుటీర పరిశ్రమని స్థాపించారు.హవల్లి కమాండ్ నుండి భద్రతా సిబ్బంది నగ్రా ప్రాంతంలో ఒక స్థానిక మద్యం కర్మాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని నడుపుతున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. " మా గల్ఫ్ డాట్ కామ్ " నివేదిక ప్రకారం, అధికారులు 27 పీపాలతో సహా నిషేధించిన మద్యం తయారీలో ఉపయోగించిన సామగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. హవాల్లీ సెక్యూరిటీ చీఫ్ అబిడేన్ అల్-అబిదీన్ మాట్లాడుతూ మద్యం తయారీదారుల ముగ్గురు ఈ కర్మాగారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకొంది. దాంతో వీరిపై నిఘా పెట్టిన గూడాచారుల బృందం సమాచారం యొక్క ప్రామాణికతను నిర్ధారించేందుకు వారిపై నిఘా పెట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి ఆ కర్మాగారం శోధన మరియు అరెస్ట్ వారెంట్ పొందిన అనంతరం అధికారులు తగిన సమయంలో ఏకకాలంలో అపార్టుమెంట్లు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ నిందితులు విచారణ సమయంలో తమ నేరం అంగీకరించారు, వారు తయారుచేసిన నిషిద్ధ మద్యం తమ వినియోగదారులకు పంపిణీ చేసినట్లు వారు ఒప్పుకొన్నారు. దీంతో వీరిని చట్టబద్దమైన చర్య కోసం సంబంధిత అధికారులను సూచించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







