ఇకపై పాస్పోర్టు పొందడం చాలా సులభం..!
- December 30, 2017
పాస్పోర్టు పొందడానికి ఇప్పటికే నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర ప్రభుత్వం మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాస్పోర్టు పొందాలంటే జనన ధ్రువీకరణపత్రం లేదా ఎస్ఎస్సీ మార్కుల జాబితాగాని పొందుపర్చాల్సి ఉండేది. ఇకపై ఎస్ఎస్సి మార్కుల జాబితాను పొందుపర్చాల్సిన అవసరం లేదు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన ధ్రువ పత్రాల విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పలు సడలింపులను చేసింది. ఇప్పటి వరకు జనన ధ్రువీకరణకు ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లేదా పంచాయతీ లేదా మున్సిపాలటీ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్కార్డు, ఓటరు గుర్తింపు కార్డులలో ఉన్న పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. భార్యభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా భాగస్వామి పేరు నమోదు చేయాల్సి వచ్చేది. ఆ నిబంధనను కూడా సడలించారు.
తాజా మార్గదర్శకాలు ఇలా..
పాస్పొర్టుకు జనన ధ్రువీకరణపత్రం అవసరం లేదు. ఎస్ఎస్సీ మార్కులు జాబితా అవసరం లేదు. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులలో నమోదు చేసిన పుట్టిన తేదీ సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యొగులు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే ఎన్వోసీ సమర్పించాల్సి ఉండేది. ఇకపై ఆ అవసరం కూడా లేదు. సర్వీసు రిజిష్టర్ చూపిస్తే సరిపొతుంది. పెన్షనర్లు తాము పొందుతున్న పెన్షన్ వివరాలు ఇస్తే సరిపోతుంది. టీసీ(ట్రాన్సఫర్ సర్టిఫికెట్), పాన్కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డుల్లో ఏవైనా రెండు గుర్తింపు కార్డులను దరఖాస్తుతో పొందుపర్చుకోవచ్చును. అనాథ పిల్లలు దరఖాస్తుకు తాము ఉండే అనాథ శరణాలయం నుంచి లేఖ ఇస్తే సరిపోతుంది. లేదా శిశు సంరక్షణ సంస్థ తమ లెటర్ హెడ్పై వివరాలు రాసిచ్చినా అనుమతిస్తారు. వివాహాం అయిన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలంటే వివాహా ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. భాగస్వామి పేరు రాస్తే సరిపోతుంది. విడాకులు తీసుకున్న వారు కోర్టు ధ్రువీకరించిన పత్రాలను పొందుపర్చాలసిన అవసరం లేదు. తల్లి బిడ్డలు సమ్మతిస్తే భర్త పేరు రాయాల్సిన అవసరం లేదు. సాధువులు, సన్యాసులు తమ గురువు పేరు రాసి దరఖాస్తులు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







