80 శాతం డిస్కౌంట్తో యూఏఈలో బిగ్గెస్ట్ సేల్
- December 30, 2017
2018 జనవరి 1 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న నేపథ్యంలో 'ప్రీ వ్యాట్' సేల్స్ ఊపందుకుంటున్నాయి. బిగ్గెస్ట్ వింటర్ క్లియరెన్స్ సేల్లో బాగంగా షార్జా ఎక్స్పో సెంటర్ వద్ద 'ఫెయిర్' నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31తో ముగియనున్న ఈ ఫెయిర్లో, 80 శాతం వరకు డిస్కౌంట్తో ఆయా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లతో ఎదురుచూస్తున్నాయిక్కడ. జనవరి 1 నుంచి ఐదు శాతం 'లెవీ' ఆయా వస్తువులపై అదనంగా చెల్లించాల్సి ఉన్నందున, ఈ అద్భుతమైన ఆఫర్ని డిసెంబర్ 31లోపు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఐదు దిర్హామ్లు ఎంట్రీ ఫీజ్. 12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఎంట్రీ ఫ్రీ.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!