80 శాతం డిస్కౌంట్తో యూఏఈలో బిగ్గెస్ట్ సేల్
- December 30, 2017
2018 జనవరి 1 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న నేపథ్యంలో 'ప్రీ వ్యాట్' సేల్స్ ఊపందుకుంటున్నాయి. బిగ్గెస్ట్ వింటర్ క్లియరెన్స్ సేల్లో బాగంగా షార్జా ఎక్స్పో సెంటర్ వద్ద 'ఫెయిర్' నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31తో ముగియనున్న ఈ ఫెయిర్లో, 80 శాతం వరకు డిస్కౌంట్తో ఆయా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లతో ఎదురుచూస్తున్నాయిక్కడ. జనవరి 1 నుంచి ఐదు శాతం 'లెవీ' ఆయా వస్తువులపై అదనంగా చెల్లించాల్సి ఉన్నందున, ఈ అద్భుతమైన ఆఫర్ని డిసెంబర్ 31లోపు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఐదు దిర్హామ్లు ఎంట్రీ ఫీజ్. 12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఎంట్రీ ఫ్రీ.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







