68 గ్యాస్ స్టేషన్ల సీజ్
- January 01, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ (ఎంసిఐ), కింగ్డమ్లో మొత్తం 68 ఫ్యూల్ స్టేషన్స్ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆదివారం రాత్రి పెట్రోల్ అమ్మకాల్ని నిలిపివేసినందుకుగాను ఈ ఫ్యూయల్ స్టేషన్లను సీజ్ చేయడం జరిగిందని ఎంసిఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 1,597 ఫ్యూయల్ స్టేషన్లను తనిఖీ చేసి, నిబంధనల్ని ఉల్లంఘించిన ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎంసిఐ తరఫున తనిఖీలు జరుగుతూనే ఉంటాయనీ, ధరల మోసాలకి పాల్పడినా, ట్యాంపరింగ్కి పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎంసిఐ ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకుల్ని హెచ్చరించింది. కొన్ని ఫ్యూయల్ స్టేషన్లను ముందస్తుగా మూసివేయడంతో మిగతా స్టేషన్లలో వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకులు చూపిన అత్యుత్సాహం సీజ్ దాకా వెళ్ళింది, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







