68 గ్యాస్ స్టేషన్ల సీజ్
- January 01, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ (ఎంసిఐ), కింగ్డమ్లో మొత్తం 68 ఫ్యూల్ స్టేషన్స్ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆదివారం రాత్రి పెట్రోల్ అమ్మకాల్ని నిలిపివేసినందుకుగాను ఈ ఫ్యూయల్ స్టేషన్లను సీజ్ చేయడం జరిగిందని ఎంసిఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 1,597 ఫ్యూయల్ స్టేషన్లను తనిఖీ చేసి, నిబంధనల్ని ఉల్లంఘించిన ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎంసిఐ తరఫున తనిఖీలు జరుగుతూనే ఉంటాయనీ, ధరల మోసాలకి పాల్పడినా, ట్యాంపరింగ్కి పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎంసిఐ ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకుల్ని హెచ్చరించింది. కొన్ని ఫ్యూయల్ స్టేషన్లను ముందస్తుగా మూసివేయడంతో మిగతా స్టేషన్లలో వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకులు చూపిన అత్యుత్సాహం సీజ్ దాకా వెళ్ళింది, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









