విదేశీ పర్యటనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

- January 02, 2018 , by Maagulf
విదేశీ పర్యటనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2018 నూతన సంవత్సర ప్రారంభంలో సౌత్ ఈస్ట్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో సుష్మా స్వరాజ్ పర్యటించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సుష్మా పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా సుష్మా స్వరాజ్ మొదటగా థాయ్‌లాండ్‌కు వెళ్లనున్నారు. అనంతరం ఇండోనేషియాలో ఆపై సింగపూర్‌లో పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com