గజల్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..
- January 02, 2018
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న పనిమనిషి పార్వతిని విచారణకు హాజరు కావాలని పిలిచారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై ఆరా తీయనున్నారు. ప్రధానంగా బాధితురాలు పార్వతిపై ఆరోపణలు చేసింది. తనను గజల్ శ్రీనివాస్తో గడపాలని ఒత్తిడి చేసిందని చెప్పింది. దీనిపైనా ఆమెను ప్రశ్నించనున్నారు. అలాగే ఆలయ వాణి మాజీ ఉద్యోగుల్ని కూడా విచారణకు హాజరు కావాలని పిలిచినట్లు తెలుస్తోంది. ఇటు గజల్ బెయిల్ పిటిషన్, పోలీసు కస్టడీ పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న గజల్ను ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. అందుకే అతడ్ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంకా బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయొచ్చంటున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







