ఏ టీ ఎం విత్ డ్రాలలో విలువ ఆధారిత ( వేట్ ) పన్నులేదు
- January 02, 2018
రియాద్:ఏదైనా సంస్కరణ దేశంలో మొదలైతే ...గోరంతలు...కొండంతలు చేసి అనేక అనుమానాలు ..పలు సందేహాలు మిళితం చేసి వెనువెంటనే కొందరు అసత్య ప్రచారం సోషల్ మీడియాలో మొదలుపెట్టడం ఇటీవల అధికమయ్యింది. ఏ టీ ఎం విత్ డ్రాలలో సంబంధించి ఎలాంటి విలువ ఆధారిత పన్ను (వాట్) చార్జ్ చేయబడదని సమాచార కమిటీ సెక్రటరీ జనరల్ ,సౌదీ బ్యాంకుల అవగాహన అధికార ప్రతినిధి టాలాట్ హాఫిజ్ హాఫిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక నిర్దిష్ట బ్యాంక్ యొక్కవినియోగదారుడు మరో బ్యాంకు యొక్క ఏ టీ ఎం నుండి డబ్బును ఉపసంహరించుకుంటే విలువ ఆధారిత పన్ను (వేట్) వసూలు చేయబడుతుందనే పుకార్లు సామాజిక మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం కావడాన్ని ఆయన ఖండించారు. కస్టమర్ యొక్క బ్యాంకు లేదా ఏ ఇతర బ్యాంక్ యొక్క ఏ టీ ఎంల నుండి ఉపసంహరణలపై ఏ విధమైన వేట్ ఉండదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సోషల్ మీడియా ద్వారా ఏదైనా అసత్య సమాచారాన్ని పంచుకోవడం లేదా వేరే ఇతరులకు పంపిణి చేయడం పట్ల ప్రముఖ న్యాయ నిపుణుడు ఇబ్రహీం జామ్జామి ప్రజలను హెచ్చరించారు. అటువంటి పోస్టులను పంచుకునేందుకు లేదా వేరేవారికి పంపించే వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుట హాజరుకావాల్సిన బాధ్యత వహిస్తానని ఆయన చెప్పారు. కింగ్డమ్ లో సైబర్ చట్టాలు తెలిసే లేదా తెలియకుండా తప్పుడు సమాచారంను కొందరు ప్రజలు వెర్రిగా వ్యాప్తి లేదా ఆ తప్పుడు సమాచారంలో భాగస్వామ్యంలో పాత్ర ఉంటే అటువంటి వారు శిక్షార్హులవుతారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!









