ఒమన్లో విహరిస్తున్న ప్రిన్స్
- January 03, 2018
అగ్ర కథానాయకుడు మహేశ్బాబు కుటుంబం విహారయాత్ర కోసం ఒమన్కు వెళ్లింది. అక్కడ మహేశ్, ఆయన కుమారుడు గౌతమ్ పారాగ్లైడింగ్ చేశారు. గాల్లో విహరించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను నమ్రత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
'నా సూపర్ హీరోలు.. పారాగ్లైడర్స్. తండ్రిలాగే కుమారుడు. అందమైన ఒమన్' అని రాశారు. ఇదే ట్రిప్లో తీసిన కొన్ని ఫొటోలను ఆమె గత కొన్ని రోజులుగా సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఆమె షేర్ చేయని మహేశ్ మరో ఫొటో ప్రస్తుతం ఆన్లై న్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
'స్పైడర్' తర్వాత మహేశ్ 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







