దుబాయ్లో బైకు అంబులెన్సులు మహిళలచే నిర్వహణ
- January 03, 2018
దుబాయ్: ప్రమాదంలో చిక్కుకొని సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేనివారి సౌకర్యార్ధం మహిళలచే నడపబడే ద్విచక్రవాహన అంబులెన్సులను దుబాయిలో ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎవరికైన ప్రాణాపాయ స్థితి ఏర్పడితే అంబులెన్సులు వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో విఫలమవుతున్నట్లు దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్సు సర్వీసెస్ ప్రకటించింది. దీంతో అత్యధికులు మృతి చెందుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అటువంటి పరిస్థితిని నివారించేందుకు బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఎవరికైన ప్రమాదం జరిగితే బైక్ అంబులెన్సులకు ఫోన్ చేసి సమాచారమందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









