దుబాయ్లో బైకు అంబులెన్సులు మహిళలచే నిర్వహణ
- January 03, 2018
దుబాయ్: ప్రమాదంలో చిక్కుకొని సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేనివారి సౌకర్యార్ధం మహిళలచే నడపబడే ద్విచక్రవాహన అంబులెన్సులను దుబాయిలో ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎవరికైన ప్రాణాపాయ స్థితి ఏర్పడితే అంబులెన్సులు వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో విఫలమవుతున్నట్లు దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్సు సర్వీసెస్ ప్రకటించింది. దీంతో అత్యధికులు మృతి చెందుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అటువంటి పరిస్థితిని నివారించేందుకు బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఎవరికైన ప్రమాదం జరిగితే బైక్ అంబులెన్సులకు ఫోన్ చేసి సమాచారమందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







