భారత్లో ఒమనీలకు హెచ్చరిక
- January 03, 2018
మస్కట్: ముంబైలోని ఒమనీ కాన్సులేట్, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై సహా, మహారాష్ట్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమనీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ కాన్సులేట్ హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో తమ పౌరులు స్పందించడానికి 0091222876037/38 నెంబర్ని కూడా ఏర్పాటు చేసినట్లు కాన్సులేట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పూణే సమీపంలోని భిమా కోరెగాన్ గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ళదాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరింతగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశం ఉన్నందున ఒమన్ పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







