భారత్లో ఒమనీలకు హెచ్చరిక
- January 03, 2018
మస్కట్: ముంబైలోని ఒమనీ కాన్సులేట్, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై సహా, మహారాష్ట్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమనీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ కాన్సులేట్ హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో తమ పౌరులు స్పందించడానికి 0091222876037/38 నెంబర్ని కూడా ఏర్పాటు చేసినట్లు కాన్సులేట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పూణే సమీపంలోని భిమా కోరెగాన్ గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ళదాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరింతగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశం ఉన్నందున ఒమన్ పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







