భారత్లో ఒమనీలకు హెచ్చరిక
- January 03, 2018
మస్కట్: ముంబైలోని ఒమనీ కాన్సులేట్, తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై సహా, మహారాష్ట్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమనీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ కాన్సులేట్ హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో తమ పౌరులు స్పందించడానికి 0091222876037/38 నెంబర్ని కూడా ఏర్పాటు చేసినట్లు కాన్సులేట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. పూణే సమీపంలోని భిమా కోరెగాన్ గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ళదాడుల నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరింతగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశం ఉన్నందున ఒమన్ పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









