ఇజ్రాయెల్లో 'బ్రహ్మాస్త్ర' సినిమా
- January 03, 2018
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో అమితాబ్బచ్చన్ నటించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇజ్రాయెల్లో మొదలయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు కరణ్. ''బ్రహ్మాస్త్ర' ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది''అని ట్వీటారు. ఇందులో రణ్బీర్ అతీంద్రియ శక్తులున్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి భాగం ఆగస్టు 2019కి ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల