కొత్త దారుల్లో గోల్డ్‌ స్మగ్లర్లు..

- January 04, 2018 , by Maagulf
కొత్త దారుల్లో గోల్డ్‌ స్మగ్లర్లు..

శంషాబాద్‌ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గోల్డ్‌ స్మగ్లర్లు కొత్త దారుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా ఓ ప్రయాణికురాలి నుంచి 11 లక్షల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

సౌదీ ఎయిర్‌ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి ఓ ప్రయాణికురాలు వచ్చింది. ఆమెను తనిఖీ చేయగా 353 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికురాలు ఎవ్వరికీ అనుమానం రాకుండా బంగారు గాజులను శరీర అంతర్భాగంలో అమర్చి తీసుకొచ్చింది. కస్టమ్స్ అధికారులు తమ దైన శైలిలో తనిఖీలు చేయడంతో బంగారం పట్టుబడింది. దీని విలువ 11 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com