సౌదీ కష్టాల నుంచి విముక్తి చెందిన మహిళలు
- January 05, 2018
హైదరాబాద్:క్షేమంగా నగరానికి చేరుకున్న ఇద్దరు మహిళలు.నగరం నుంచి సౌదీకి ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు విదేశాంగ శాఖ చొరవతో ఎట్టకేలకు ఇక్కడకు చేరుకున్నారు. వివరాలను ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ తెలిపారు. టోలీచౌక్ హకీంపేట్కు చెందిన నసీంబేగం నగరంలోని ఓ ఏజెంట్ ద్వారా రెండున్నర ఏళ్ల క్రితం సౌదీకి ఉద్యోగానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగం బదులు ఓ ఇంట్లో పని మనిషిగా చేర్చారు. వేతనం ఇవ్వకపోవడంతోపాటు అనేక కష్టాలు ఆమె ఎదుర్కొన్నారు. శామీర్పేటకు బాలాజీనగర్కు చెందిన నుజ్జత్బేగంది కూడా ఇదే వ్యథ. అక్కడి ఆసుపత్రిలో ఉద్యోగానికని ఏజెంట్ ఆమెను పంపించారు. తీరా ఓ ఇంట్లో పని మనిషిగా చేయాల్సి వచ్చింది. గతయేడాది ఆగస్టు నుంచి సౌదీలోని ఆభాలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఈ ఇద్దరు మహిళల కష్టాలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి ఎంబీటీ నేత తీసుకువెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ రియాద్లో ఉన్న అధికారులకు వివరాలను అందించి బాధితులు స్వదేశానికి వచ్చేలా సహాయపడింది. ఈ సందర్భంగా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
తమలాంటి వారెందరో ఉద్యోగాల నిమిత్తం వెళ్లి ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. జవహర్నగర్ ఠాణాలో ఏజెంట్పై ఫిర్యాదు చేసినట్లు నుజ్జత్బేగం తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







