జనవరి 8న 'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్..
- January 05, 2018
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జైసింహా'. నయనతార, నటాషాదోషి, హరిప్రియ కథానాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు ప్రమోషన్ పర్వంలోకి దిగింది. ఈనెల 8న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. బాలయ్యతో పనిచేసిన దర్శకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. బోయపాటి, క్రిష్, తేజ. వీళ్లంతా ఈ వేడుకలో కనిపించే అవకాశం ఉంది.
'జైసింహా' అభిమానులు పండగ చేసుకునే సినిమా అని, ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి నిర్మాత చెబుతున్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







