తెలంగాణ వాహనాల పై కేరళ ప్రభుత్వం భారీ ట్యాక్స్
- January 05, 2018
తిరువనంతపురం : తెలంగాణ రిజిస్ట్రేషన్తో అడుగుపెట్టే వాహనాలపై కేరళ ప్రభుత్వం భారీగా రోడ్ ట్యాక్స్ విధించింది. కేరళ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడంతో.. తామూ ఆ పని చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్పై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పదాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందాలను నీరుగార్చిందని కేరళ పేర్కొంది. అంతర్రాష్ట్ర రోడ్డు ట్యాక్స్లపై కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒప్పందాలున్నాయి. ఈ ఒప్పందాలను కొనసాగించాలని కేరళ ప్రభుత్వం చేసిన సూచనన తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చే స్టేజ్ కారియర్లపై కేరళ రోడ్డు పన్నును విధించింది.
అయ్యప్పలపై పన్నుపోటు
ప్రస్తుతం కేరళలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ స్థాయిలో భక్తులు కేరళ వెళ్తున్నారు. వేల కొద్దీ తెలంగాణ వాహనాలు కేరళలో ప్రయాణిస్తున్నాయి. కొత్త ట్యాక్స్ ప్రకారం.. 49 సీట్లున్న స్టేజ్ కారియర్.. కేరళకు రూ. 15 వేలు పన్ను కట్టాలి. కేరళ ప్రభుత్వం ఒక్క సీటుకు రూ.300 నుంచి రూ. 400 వరకూ ఛార్జ్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







