ప్రధాని మోడీని కలిసిన ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు

- January 05, 2018 , by Maagulf
ప్రధాని మోడీని కలిసిన ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు

విభజన చట్టంలోని అంశాలను వేగంగా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరారు ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు.. ముఖ్యంగా రైల్వే జోన్‌, ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ స్థానల పెంపు లాంటి అంశాలను ప్రధాని ముందు ఉంచింది ఎంపీల బృందం..

2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటు 7500 కోట్ల రూపాయలకు గాను, 3979 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఇఏపీ ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులు ఇప్పించాలని కోరారు. మరోవైపు ఏపీ భవన్‌ విభజన వేగవంతం చేయాలని కోరారు..

ఇద్దరు మంత్రులు, 14 మంది ఎంపీలు ప్రధాని మోడిని కలిసి.. 16 పేజీల మెమోరాండాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. వెంటనే ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శికి మెమోరాండాం ప్రతిని ఇచ్చి... ఫాలోఅప్‌ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ముందు ప్రధాని స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com