ప్రధాని మోడీని కలిసిన ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు
- January 05, 2018
విభజన చట్టంలోని అంశాలను వేగంగా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరారు ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలు.. ముఖ్యంగా రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ, అసెంబ్లీ స్థానల పెంపు లాంటి అంశాలను ప్రధాని ముందు ఉంచింది ఎంపీల బృందం..
2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ లోటు 7500 కోట్ల రూపాయలకు గాను, 3979 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఇఏపీ ప్రాజెక్టులకు రుణాల రూపంలో నిధులు ఇప్పించాలని కోరారు. మరోవైపు ఏపీ భవన్ విభజన వేగవంతం చేయాలని కోరారు..
ఇద్దరు మంత్రులు, 14 మంది ఎంపీలు ప్రధాని మోడిని కలిసి.. 16 పేజీల మెమోరాండాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. వెంటనే ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శికి మెమోరాండాం ప్రతిని ఇచ్చి... ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ముందు ప్రధాని స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







