'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ విడుదల
- January 07, 2018
హైదరాబాద్: 'ధనం మూలం ఇదం జగత్.. ప్రపంచంలో జరిగే తప్పులన్నింటికీ డబ్బే కారణం' అంటున్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన నటిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. సరదా సన్నివేశాలతో ఈ టీజర్ను రూపొందించారు.
పూజారులుగా ఇక్కడ జీవితం సాగిస్తున్న బ్రహ్మనందం, ఆయన బృందంతో విష్ణు అమెరికాకు వెళ్దామని, అక్కడైతే డాలర్లు సంపాదించొచ్చని చెబుతారు. దీంతో అందరూ కలిసి అమెరికా వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొనే సంఘటనలను వినోదబరితంగా టీజర్లో చూపించారు. చివర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి.
జి నాగేశ్వరరెడ్డి 'ఆచారి అమెరికా యాత్ర'కు దర్శకత్వం వహించారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. పద్మజా పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనూప్ సింగ్ ఠాకూర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!







