కేసీఆర్ కు 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో
- January 07, 2018
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉప్పునిప్పుగా ఉన్న పవన్కల్యాణ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న ప్రగతి భవన్లో కలవడం అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు పవన్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా ప్రత్యేక షో వేస్తారంట. ఈ సినిమా చూడడానికి ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ శనివారం (జనవరి-6) తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ రామ్మోహన్రావును తెలంగాణ సచివాలయంలో కలిశారు. ఈ నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలవుతోంది. మంత్రి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ స్పెషల్ షోకు సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించారని తెలిసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై అజ్ఞాతవాసి తీస్తున్న సినిమాలో కీర్తి సురేశ్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







