కేసీఆర్ కు 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో
- January 07, 2018
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉప్పునిప్పుగా ఉన్న పవన్కల్యాణ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న ప్రగతి భవన్లో కలవడం అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు పవన్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా ప్రత్యేక షో వేస్తారంట. ఈ సినిమా చూడడానికి ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ శనివారం (జనవరి-6) తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ రామ్మోహన్రావును తెలంగాణ సచివాలయంలో కలిశారు. ఈ నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలవుతోంది. మంత్రి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ స్పెషల్ షోకు సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించారని తెలిసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై అజ్ఞాతవాసి తీస్తున్న సినిమాలో కీర్తి సురేశ్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







