కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' ఫస్ట్ లుక్ విడుదల
- January 08, 2018
నటుడిగా, నిర్మాతగా సక్సెస్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల జై లవకుశ అనే చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాడు. ఇక నటుడిగా ఎంఎల్ఏ అనే చిత్రాన్ని చేశాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలోనే ఈ మూవీ విడుదలకి ప్లాన్ చేశారు నిర్మాతలు. ఇక ప్రస్తుతం 59 ఏళ్ల రైటర్ జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తుండడం విశేషం. అయితే ఈ మూవీకి తాజాగా తాజాగా 'నా నువ్వే' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనేది ట్యాగ్ లైన్ ను గా ఉంచారు. కల్యాణ్ రామ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా తన గ్లామర్తో ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. తొలిసారిగా తమన్నా..
కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







