మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన..

- November 20, 2015 , by Maagulf
మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన..

నాలుగు రోజుల మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. కౌలాలంపూర్ లో జరగనున్న 13వ ఆసియా దేశాల వ్యాపార సదస్సులో ఆయన పాల్గొంటారు. అనంతరం 10వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సదస్సులకు హాజరుకానున్న విదేశాల నేతలతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నట్లు సమాచారం. భారత్ కు విదేశీ పెట్టుబడులను రప్పించే దిశగా ప్రధాని ఆయా దేశాల నేతలతో చర్చిస్తారు. మలేషియా, సింగపూర్ దేశాలలో మోదీ నాలుగు రోజులు పర్యటించి ఆ రెండు దేశాల అగ్రనేతలతో కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com