దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్ల్ కోసంజెట్ ఎయిర్వేస్ ఆఫర్
- November 20, 2015
ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. వచ్చే ఏడాది జరగనున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్ల్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారికి రాను, పోను టికెట్ ధరను రూ.29,395గా నిర్ణయించింది. ఈ ఆఫర్లోభాగంగా దుబాయ్ నగరాన్ని సైతం తిలకించవచ్చును. ఈ ఆఫర్ కింద మూడు రాత్రులు, నాలుగు రోజులపాటు దుబాయిలోని ప్రత్యేక హోటల్లో వసతిని ఏర్పాటు చేయనున్నది. ఈ ఆఫర్లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1, 2016 మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రతియేటా జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దుబాయ్లో జరిగే అతిపెద్ద షాపింగ్ ఉత్సవాలకు భారత్తోపాటు పలు దేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వెళ్తుంటారు. వారికోసమే ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









