దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్ల్ కోసంజెట్ ఎయిర్వేస్ ఆఫర్
- November 20, 2015
ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. వచ్చే ఏడాది జరగనున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్ల్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారికి రాను, పోను టికెట్ ధరను రూ.29,395గా నిర్ణయించింది. ఈ ఆఫర్లోభాగంగా దుబాయ్ నగరాన్ని సైతం తిలకించవచ్చును. ఈ ఆఫర్ కింద మూడు రాత్రులు, నాలుగు రోజులపాటు దుబాయిలోని ప్రత్యేక హోటల్లో వసతిని ఏర్పాటు చేయనున్నది. ఈ ఆఫర్లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1, 2016 మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రతియేటా జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దుబాయ్లో జరిగే అతిపెద్ద షాపింగ్ ఉత్సవాలకు భారత్తోపాటు పలు దేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వెళ్తుంటారు. వారికోసమే ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







