దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్ల్ కోసంజెట్ ఎయిర్వేస్ ఆఫర్
- November 20, 2015
ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. వచ్చే ఏడాది జరగనున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్ల్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారికి రాను, పోను టికెట్ ధరను రూ.29,395గా నిర్ణయించింది. ఈ ఆఫర్లోభాగంగా దుబాయ్ నగరాన్ని సైతం తిలకించవచ్చును. ఈ ఆఫర్ కింద మూడు రాత్రులు, నాలుగు రోజులపాటు దుబాయిలోని ప్రత్యేక హోటల్లో వసతిని ఏర్పాటు చేయనున్నది. ఈ ఆఫర్లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1, 2016 మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రతియేటా జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దుబాయ్లో జరిగే అతిపెద్ద షాపింగ్ ఉత్సవాలకు భారత్తోపాటు పలు దేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వెళ్తుంటారు. వారికోసమే ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







