'అజ్ఞాతవాసి' ప్రీమియర్ సందడి

- January 10, 2018 , by Maagulf

దుబాయ్: పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి దేశదేశాల నుంచి మంచి స్పందన లభిస్తోంది..

దుబాయ్ లోని ప్రీమియర్ షోస్ కు పవన్ అభిమానులు తండోపతండాలుగా విచ్చేసి తమ అభిమాన నటుడి చిత్రాన్ని ముందుగా చూడాలనే తపనతో సందడి చేశారు.

దుబాయ్ లోని 'అల్ కూస్ మాల్' లో గల 'బాలీవుడ్ సినిమాస్' థియేటర్ లో 'దుబాయ్ పవనిజం సేవ సమితి' ఆధ్వర్యంలో అభిమానులందరూ కేక్ కటింగ్ చేసి ప్రీమియర్ షోస్ ను ఆరంభించారు. సమితి ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ భారీ సక్సెస్ అవుతుందని, పవన్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని' తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రవి చల్ల, పాపారావు, సుబ్బారావు, రవి సింగరి, సాయినాథ్, దుర్గారావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com