కేటీఆర్: హైదరాబాద్‌లో విదేశీ భవన్

- January 10, 2018 , by Maagulf
కేటీఆర్: హైదరాబాద్‌లో విదేశీ భవన్

న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలో విదేశీ భవన్‌కు త్వరలో స్థలం కేటాయిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహర్ భవన్‌లో భారత సంతతి పౌరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై.. సుష్మాస్వరాజ్ అన్ని రాష్ట్రాల మంత్రులతో చర్చించారని తెలిపారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి మళ్లీ వెళ్తే.. వారిని భారత్‌కు తీసుకొచ్చి పాస్‌పోర్ట్ రద్దు చేయాలని నిర్ణయించారని అన్నారు. తెలంగాణలో నకిలీ పాస్‌పోర్ట్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com