కతార్ లో నేటితో ముగుస్తున్న ధౌ పండుగ
- November 21, 2015
సాంప్రదాయిక పెరల్ డైవింగ్ (సముద్ర గర్భంలోకి వెళ్ళడం) పోటీతో సహా వివిధ అంశాలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేయడంతో, ఐదవ కతారా సంప్రదాయ ధౌ పర్వదినం నేటితో సమాప్తమవనుంది. మూడు రోజుల సౌదీ అరేబియా, కువైట్, బహరేన్, కతార్ మరియు ఒమాన్ దేశాల నుండి, హ్యాండ్ లైన్ ఫిషింగ్, రోయింగ్, ఉచ్చ లతో చేపలు పట్టడం, తెరచాపను ఎత్తడం, అల్ ఖత్ఫా మరియు సంప్రదాయ ధౌ పోటీలలో పాల్గొన్న వారిలో మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందించారు. ధౌ మరియు హస్తకళల ప్రదర్సన మాత్రమే కాకుండా, ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన బంగారం మరియు ముత్యాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. యాకుబ్ యుసేఫ్ అల్ మన్సౌరి అనే అధికారి, మహిళలు తమ బంగారు ఆభరణాలను కేవలం 30 సెకెన్లలో తనిఖీ చేసే మిషన్ సహాయంతో పరీక్షించుకోవడానికి వరుసలు కట్టారని, తద్వారా వినియోగదారులు బంగారు ఆభరణాలను కొనుగోలు చాల జాగ్రత్తగా చేస్తున్నారని గ్రహించామని, అదే విధంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొనే అవకాసం కూడా ఈ ఉత్సవం కలిగించిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









