భార్యల్ని సంతృప్తి పరచేందుకు డ్రగ్స్ వినియోగం
- January 11, 2018
తన ముగ్గురు భార్యల్ని సంతృప్తి పరిచేందుకోసం తాను డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించడం సంచలనంగా ఉంది. జిసిసి జాతీయుడు, షార్జా మిస్డెమీనర్ కోర్టులో విచారణకు హాజరయ్యాడు. నిందితుడిపై మెఠాంఫెటమైన్ క్రిస్టల్ లేదా క్రిస్టల్ మెథ్ (యూఏఈలో షెబుగా వ్యవహరిస్తారు) వినియోగిస్తున్నట్లు కేసు నమోదయ్యింది. విచారణ సందర్భంగా, న్యాయస్థానాన్ని కన్విన్స్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. తాను అమాయకుడిననీ, తన ముగ్గురి భార్యలను సంతృప్తి పరచేందుకే డ్రగ్స్ తీసుకున్నానని పేర్కొన్నాడు. తన స్నేహితుడు ఇచ్చిన ఓ మందు కారణంగా తాను హైపర్ యాక్టివ్గా మారేవాడిననీ, అలా తనకు ఆ మందు అలవాటయ్యిందని చెప్పాడు. ఆ మందు యూఏఈలో నిషేధించబడిందని తనకు తెలియదని అంతకు ముందు న్యాయస్థానం యెదుట మొరపెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మాట మార్చాడు. నిషేధిత మందు అని తెలిసీ, తన భార్యల కోసం అలా చేయాల్సి వచ్చిందనీ, తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తనను క్షమించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









