ఛార్జీలను పెంచిన కరీమ్, ఊబర్
- January 11, 2018
రైడ్ హెయిలింగ్ క్యాబ్ సర్వీసులు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. వ్యాట్ అమలు నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకోనున్నట్లు ఊబర్, కరీమ్ సంస్థలు వెల్లడించాయి. యూఏఈలో ఈ రెండూ తమ యాప్స్ ద్వారా వినియోగదారుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ని 5 శాతం వ్యాట్ నుంచి మినహాయించినప్పటికీ, మార్కెట్ ప్లేస్ సర్వీసెస్కి సంబంధించి 1.7 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తోందనీ, అది క్యాబ్ ఛార్జీలపై పడిందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఊబర్ ఎక్స్, ఊబర్ సెలక్ట్, ఊబర్ బ్లాక్, ఊబర్ ఎక్స్ఎల్,ఊబర్ వన్ మరియు ఊబర్ విఐపిలకు ఈ టాక్స్ వర్తిస్తుంది. గతంలో 100 దిర్హామ్ల ఖర్చయ్యే దూరానికి ఇకపై 101.7 దిర్హామ్ల ఖర్చు కానుంది. కరీమ్ సంస్థ, దాదాపుగా ఛార్జీలు 1 శాతం వరకు పెరుగుతున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









