ప్రవాసీయులు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 1,000 కువైట్ దినార్లను చెల్లించాలి
- January 11, 2018కువైట్ : ' పొమ్మనకుండా ...పొగ పెట్టిన ' చందాన కువైట్ లో ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి ప్రవాసీయులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే1,000 కువైట్ దినార్లను వసూలు చేయాలనీ పార్లమెంటరీ సభ్యుడు సఫా అల్హీహెమ్ ప్రతిపాదనను దాఖలు చేశారు. ప్రవాసీయులకు డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయటం, వాటి పునరుద్ధరణలు, వాహనాలను నమోదు చేయడం, 10 సంవత్సరాల కంటే పాతవైన వాహనాలు వారు వాడుతున్నట్లు ఆరోపించారు.రహదారి గ్రిడ్లను విస్తరించేందుకు, అభివృద్ధి చేయడానికి, వివిధ రహదారులపై జరుగుతున్న నిర్మాణాల ఫలితంగా ప్రస్తుత ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సమన్వయంతో ఈ క్రిందివి ప్రణాళికతో ఉన్నట్లు స్థానిక మీడియా లో ప్రచురితమైంది
నిర్వాసితులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి 1,000 కువైట్ దినార్లను సేకరిస్తుంది.
• ఈ లైసెన్స్లను పునరుద్ధరించడానికి 500 కువైట్ దినార్లను వార్షిక రుసుముగా వసూలు చేయడం.
• 500 కువైట్ దినార్లను ఫీజును వసూలు చేయడం మరియు ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉన్న ప్రవాసీయుల నుండి ఆ మొత్తాన్ని రాబట్టడం .
• ఫోర్జరీ మరియు మినహాయింపులను నివారించడానికి వారి పని అనుమతికి నిర్వాసితులు 'డ్రైవింగ్ లైసెన్స్లను స్వయంచాలకంగా కలుపుతూ - జారీచేసే పరిస్థితులు ఏవీ తనిఖీ సమయంలోలేనట్లయితే లైసెన్స్ చెల్లుబాటు రద్దు అవుతుంది.
• 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉన్న కారు కనుక నిర్వాసితులకు ఉంటే వాహన రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించడం నిషేధించనున్నారు"
పలు సందర్భాల్లో ఎంపీ సఫా అల్-హషెమ్ ప్రవాసీయుల పట్ల తన వ్యతిరేకతను వెళ్ళగక్కుతూనే ఉన్నారు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వీసాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ దేశంలో విదేశీయుల ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రవాసీయుల తల్లిదండ్రులకు అది మినహాయించాలని , బహిరంగ వ్యతిరేక ప్రతిపాదనలను కొనసాగించారు. విదేశీయుల పన్నులను ప్రతిపాదించి, వారి డబ్బు బదిలీల మీద ఐదు శాతం రుసుము విధించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..