25 ఏళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతి
- January 11, 2018
రియాద్:పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. ఆ నిబంధనను మార్పు సౌదీఅరేబియా సవరించింది. పాతికేళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు సౌదీ వెళ్లేందుకు అనుమతి జారీ చేయనున్నామని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్(ఎస్సీటీహెచ్) వెల్లడించింది. అయితే 25 ఏళ్ల లోపు వయసున్నవారి వెంట కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా పాత నిబంధనల ప్రకారం పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో అమల్లో ఉండేది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









