3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం ఎడారిలో లభ్యం
- January 12, 2018
రియాద్: ' ఏనుగమ్మ ..ఏనుగు.. మా వూరు వచ్చిందమ్మా ఏనుగుని పిల్లలు సంబరపడినమాదిరిగా సౌదీ వాసులు ఆనందపడుతున్నారు. కారణమేమిటంటే 3 లక్షల 50ఏళ్ల నాటి ఏనుగు దంతాలు ఎడారిలో కనుగొన్నారు. తైమా ప్రాంతంలోని ఒక ఎండిపోయిన ఒక ఒయాసిస్సులో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ అరుదైన అవశేషాలు లభ్యమయ్యాయి. ఏనుగు దంతాలతోపాటు మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన అవశేషాలు సైతం ఇక్కడ కనిపించాయని సౌదీ అర్కియాలజిస్టు డాక్టర్. అలీ అల్ గాబ్బన్ చెప్పారు. ప్రస్తుతం ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతం ఒకప్పుడు జంతువులు జీవించడానికి అనువైన ప్రాంతామని ఆయన తెలిపారు. తైమాలో దొరికిన అవశేషాలను పరిశీలిస్తే సౌదీ చరిత్ర ఈనాటిది కాదని తెలుస్తోందని అలీ చెప్పారు. పలు చోట్ల తవ్వకాలు జరిపితే మరింత స్పష్టత వస్తుందని పురాతత్వ శాస్త్రవేత్త అలీ వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- విద్యార్థులకు ఎమిరేట్స్ బంపర్ ఆఫర్..విమాన టికెట్లపై తగ్గింపు, అదనపు బ్యాగేజీ సౌకర్యం
- ఇరాన్ క్షిపణి దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ.. కువైట్, జోర్డాన్కు పూర్తి మద్దతు
- లోక్సభలో ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం
- యూఏఈలో ఆగస్టులో ఇంధన ధరలు తగ్గుతాయా?
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!







