3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం ఎడారిలో లభ్యం
- January 12, 2018
రియాద్: ' ఏనుగమ్మ ..ఏనుగు.. మా వూరు వచ్చిందమ్మా ఏనుగుని పిల్లలు సంబరపడినమాదిరిగా సౌదీ వాసులు ఆనందపడుతున్నారు. కారణమేమిటంటే 3 లక్షల 50ఏళ్ల నాటి ఏనుగు దంతాలు ఎడారిలో కనుగొన్నారు. తైమా ప్రాంతంలోని ఒక ఎండిపోయిన ఒక ఒయాసిస్సులో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ అరుదైన అవశేషాలు లభ్యమయ్యాయి. ఏనుగు దంతాలతోపాటు మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన అవశేషాలు సైతం ఇక్కడ కనిపించాయని సౌదీ అర్కియాలజిస్టు డాక్టర్. అలీ అల్ గాబ్బన్ చెప్పారు. ప్రస్తుతం ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతం ఒకప్పుడు జంతువులు జీవించడానికి అనువైన ప్రాంతామని ఆయన తెలిపారు. తైమాలో దొరికిన అవశేషాలను పరిశీలిస్తే సౌదీ చరిత్ర ఈనాటిది కాదని తెలుస్తోందని అలీ చెప్పారు. పలు చోట్ల తవ్వకాలు జరిపితే మరింత స్పష్టత వస్తుందని పురాతత్వ శాస్త్రవేత్త అలీ వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









