'విశ్వనట సార్వభౌమ' డా. మోహన్ బాబు
- January 13, 2018కళాబంధు టీ. సుబ్బిరామిరెడ్డి మళ్ళీ కళాపోషణ మీద దృష్టి పెట్టారు. సినిమా కళాకారులపై ప్రత్యేక ఆసక్తి చూపించే టీఎస్సార్ మరో అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. నవరస నటుడు డాక్టర్ మోహన్ బాబు సినీరంగంలో అరంగేట్రం చేసి 42 ఏళ్ళు గడిచిన సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నది టీఎస్సార్ ఉద్దేశం. ఇందుకోసం హైదరాబాద్ శిల్పకళావేదికలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న జరిగే ఈ వేడుకకు 'టీఎస్సార్ కాకతీయ కల్చరల్ ఫెస్టివల్' అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబుకి 'విశ్వ నట సార్వభౌమ' పేరుతో బిరుదునివ్వాలన్నది కూడా టీఎస్సార్ సంకల్పం. టాలీవుడ్ నటీనటుల్లో అనేకమంది పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి టీఎస్సార్ నేతృత్వంలో ప్రెస్ మీట్ జరిగింది. నటుడు మోహన్ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. మరికొందరు ఇందులో పాల్గొని.. కార్యక్రమ రూపురేఖల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్