'విశ్వనట సార్వభౌమ' డా. మోహన్ బాబు
- January 13, 2018
కళాబంధు టీ. సుబ్బిరామిరెడ్డి మళ్ళీ కళాపోషణ మీద దృష్టి పెట్టారు. సినిమా కళాకారులపై ప్రత్యేక ఆసక్తి చూపించే టీఎస్సార్ మరో అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. నవరస నటుడు డాక్టర్ మోహన్ బాబు సినీరంగంలో అరంగేట్రం చేసి 42 ఏళ్ళు గడిచిన సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నది టీఎస్సార్ ఉద్దేశం. ఇందుకోసం హైదరాబాద్ శిల్పకళావేదికలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న జరిగే ఈ వేడుకకు 'టీఎస్సార్ కాకతీయ కల్చరల్ ఫెస్టివల్' అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబుకి 'విశ్వ నట సార్వభౌమ' పేరుతో బిరుదునివ్వాలన్నది కూడా టీఎస్సార్ సంకల్పం. టాలీవుడ్ నటీనటుల్లో అనేకమంది పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి టీఎస్సార్ నేతృత్వంలో ప్రెస్ మీట్ జరిగింది. నటుడు మోహన్ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. మరికొందరు ఇందులో పాల్గొని.. కార్యక్రమ రూపురేఖల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









