'విశ్వనట సార్వభౌమ' డా. మోహన్ బాబు
- January 13, 2018కళాబంధు టీ. సుబ్బిరామిరెడ్డి మళ్ళీ కళాపోషణ మీద దృష్టి పెట్టారు. సినిమా కళాకారులపై ప్రత్యేక ఆసక్తి చూపించే టీఎస్సార్ మరో అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు. నవరస నటుడు డాక్టర్ మోహన్ బాబు సినీరంగంలో అరంగేట్రం చేసి 42 ఏళ్ళు గడిచిన సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నది టీఎస్సార్ ఉద్దేశం. ఇందుకోసం హైదరాబాద్ శిల్పకళావేదికలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న జరిగే ఈ వేడుకకు 'టీఎస్సార్ కాకతీయ కల్చరల్ ఫెస్టివల్' అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబుకి 'విశ్వ నట సార్వభౌమ' పేరుతో బిరుదునివ్వాలన్నది కూడా టీఎస్సార్ సంకల్పం. టాలీవుడ్ నటీనటుల్లో అనేకమంది పాల్గొనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి టీఎస్సార్ నేతృత్వంలో ప్రెస్ మీట్ జరిగింది. నటుడు మోహన్ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. మరికొందరు ఇందులో పాల్గొని.. కార్యక్రమ రూపురేఖల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్