'గో ఎయిర్' వారి సంక్రాంతి కానుక
- January 13, 2018
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఎయిర్ డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అన్ని చార్జీలు కలుపుకొని రూ.1157లకే టికెట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లై స్మార్ట్, సేవ్ మోర్ స్కీం కింద ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పండగసీజన్, న్యూ ఇయర్, లాంగ్ వీకెండ్ సందర్భంగా తమ కస్టమర్లకు గొప్ప అనుభవాన్ని అందించాలని భావిస్తున్నామని గో ఎయిర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ పాటు గోఎయిర్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 10శాతం అదనపు తగ్గింపుకూడా లభ్యం. ఇలా వన్ వేలో రూ.250 తగ్గింపును, రిటర్న్ టికెట్ బుకింగ్పై 500 ఆఫర్ చేస్తోంది. జనవరి 22 తో ఈ ఆఫర్ బుకింగ్స్ ముగుస్తాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 1, ఫిబ్రవరి నుంచి 15,ఏప్రిల్దాకా ప్రయాణించవచ్చు.
గోఎయిర్ వెబ్ సైట్ ప్రకారం హైదరాబాద్-లక్నో రూ. 3002, హైదరాబాద్ -అహ్మదాబాద్ రూ. 3362, లక్నో-హైదరాబాద్ టికెట్ ధర రూ. 3574 గాను నిర్ణయించింది. అలాగే లక్నో-ఢిల్లీ టికెట్ రూ .1,455, ఢిల్లీ-లక్నో రూ .1,588, బెంగళూరు-కొచ్చి రూ .1703, పుణె-బెంగళూరుకు రూ .2,196, గౌహతి-కోల్కతా రూ. 2,244, పుణె-అహ్మదాబాద్ రూ .2405 , ఢిల్లీ-పాట్నా రూ .3,104 ధరల్లో టికెట్లను అందిస్తోంది. వీటితో పాటు ఇతర మార్గాల్లో అందిస్తున్న తగ్గింపు ధరల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చింది.
సాధారణ కాన్సిలేషన్, రీ బుకింగ్ ఈ చార్జీలు వర్తిస్తాయి. గ్రూప్ బుకింగ్లకు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







