భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

- January 13, 2018 , by Maagulf
భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

భాగ్యనగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. అనంతపురం నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మందిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్‌లో నలుగురు, ఆరంఘర్‌లో నలుగురు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు ఉండగా .. గ్యాంగ్ లీడర్ దాసరి బాబుపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్లు డిసిపి పద్మజ తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్స్‌ను సోడియం, పోటాషియంతో కలిసి తయారు చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com