సౌదీ అరేబియాలో ఫుట్బాల్ మ్యాచ్ ని చూసేందుకు స్టేడియంలో మహిళలు
- January 13, 2018
రియాద్: టీవీలలో చూడటం మినహా ఏనాడూ స్టేడియంలోనికి వెళ్ళి కూర్చొని చూడని సౌదీ అరేబియా మహిళలు తొలిసారిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి ఆటను నేరుగా తిలకించారు.సౌదీ రాజు సాల్మాన్ ఆదేశాల మేరకు వారు స్వేచ్ఛగా ప్రత్యక్షంగా ఫ్యూట్బాల్ మ్యాచ్ ని చూశారు. సౌదీ అరేబియాలో మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉండేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిషేధం ఎత్తివేయడంతో మొదటిసారిగా మహిళలు స్టేడియంకు వచ్చి ఆటను వీక్షించి ఆనందించారు. జెడ్డా నగరంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ కు ఒక చరిత్రాత్మకమైన రికార్డ్ నమోదైంది. గ త ఏడాది పలు విప్లవాత్మకమైన సౌదీ అరేబియాలో సంస్కరణలు జరిగాయి. మహిళలకు కార్లు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లలో సైతం మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







