సౌదీ అరేబియాలో ఫుట్బాల్ మ్యాచ్ ని చూసేందుకు స్టేడియంలో మహిళలు
- January 13, 2018
రియాద్: టీవీలలో చూడటం మినహా ఏనాడూ స్టేడియంలోనికి వెళ్ళి కూర్చొని చూడని సౌదీ అరేబియా మహిళలు తొలిసారిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి ఆటను నేరుగా తిలకించారు.సౌదీ రాజు సాల్మాన్ ఆదేశాల మేరకు వారు స్వేచ్ఛగా ప్రత్యక్షంగా ఫ్యూట్బాల్ మ్యాచ్ ని చూశారు. సౌదీ అరేబియాలో మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉండేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిషేధం ఎత్తివేయడంతో మొదటిసారిగా మహిళలు స్టేడియంకు వచ్చి ఆటను వీక్షించి ఆనందించారు. జెడ్డా నగరంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ కు ఒక చరిత్రాత్మకమైన రికార్డ్ నమోదైంది. గ త ఏడాది పలు విప్లవాత్మకమైన సౌదీ అరేబియాలో సంస్కరణలు జరిగాయి. మహిళలకు కార్లు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లలో సైతం మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







