సౌదీ అరేబియాలో ఫుట్బాల్ మ్యాచ్ ని చూసేందుకు స్టేడియంలో మహిళలు
- January 13, 2018
రియాద్: టీవీలలో చూడటం మినహా ఏనాడూ స్టేడియంలోనికి వెళ్ళి కూర్చొని చూడని సౌదీ అరేబియా మహిళలు తొలిసారిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి ఆటను నేరుగా తిలకించారు.సౌదీ రాజు సాల్మాన్ ఆదేశాల మేరకు వారు స్వేచ్ఛగా ప్రత్యక్షంగా ఫ్యూట్బాల్ మ్యాచ్ ని చూశారు. సౌదీ అరేబియాలో మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉండేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిషేధం ఎత్తివేయడంతో మొదటిసారిగా మహిళలు స్టేడియంకు వచ్చి ఆటను వీక్షించి ఆనందించారు. జెడ్డా నగరంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ కు ఒక చరిత్రాత్మకమైన రికార్డ్ నమోదైంది. గ త ఏడాది పలు విప్లవాత్మకమైన సౌదీ అరేబియాలో సంస్కరణలు జరిగాయి. మహిళలకు కార్లు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లలో సైతం మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









