సౌదీలో మొదటిసారిగా స్టేడియం లోకి మహిళలు
- January 13, 2018
పురుషుల ఫుట్బాల్ క్రీడ తిలకించడానికి మొట్టమొదటి సారిగా సౌదీ అరేబియాలోని మహిళలను అనుమతించారు. దీంతో నలుపు రంగు వస్త్రధారణ, ఫ్లోరెసెంట్ నారింజ దుస్తులు ధరించిన మహిళలు శనివారం రాజు అబ్దుల్లా స్టేడియంలోని గేట్లు వద్ద నిలబడి మ్యాచ్ను వీక్షించారు. అల్-అహ్లీ, అల్-బాటిన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోటీలకు మహిళలు వారి భర్తలతో, పిల్లలతో, మిత్రులతో కలిసి వీక్షించారు. జెడ్డాలోని డమ్మామ్, రియాద్ స్టేడియాలను 2018 లో ప్రారంభించి కుటుంబాలను ఆహ్వానిస్తామని గత అక్టోబర్లోనే జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం చాలా కాలం క్రితమే జరిగిఉండాల్సిందని ఈ క్రీడకు హాజరైన వారిలో ఒకరు పేర్కొన్నారు. బహిరంగ క్రీడా కార్యక్రమంలో మహిళలు పాల్గొనడానికి అనుమతించే నిర్ణయంతో దేశంలో మంచి మార్పును తెస్తుందని ఆశిస్తున్నారు.. కొన్ని నెలల క్రితం మహిళలు కారు నడిపే హక్కును సౌదీ అరేబియా ప్రకటించిన అనంతరం గురువారం వారి కోసం మొట్టమొదటి కారు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







