25 ఏండ్లు దాటిన మహిళలు ఒంటరిగా సౌదీకి రావొచ్చు.!
- January 13, 2018
ఇన్నిరోజులు సౌదీ అరేబియాను సందర్శించాలంటే మహిళలకు కచ్చితంగా పక్కన ఓ తోడు ఉండాలి. లేదంటే ఆ దేశం టూరిస్ట్ వీసానే జారీచేయదు. కానీ ప్రస్తుతం 25 సంవత్సరాలు, ఆపైబడిన మహిళలు ఇక ఒంటరిగా టూరిస్ట్ వీసాపై సౌదీ అరేబియాను సందర్శించవచ్చట. ఈ విషయాన్ని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం, నేషనల్ హెరిటేజ్ అధికార ప్రతినిధి చెప్పారు. కుటుంబ సభ్యులు లేదా సహచరులు అవసరం లేకుండానే మహిళలు సౌదీ అరేబియా సందర్శించే స్వేచ్ఛను తాము కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలు మాత్రం సౌదీ అరేబియాకి ప్రయాణించాలంటే కచ్చితంగా ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందేనని తెలిపారు. ''టూరిస్ట్ వీసా అనేది సింగిల్-ఎంట్రీ వీసా. గరిష్టంగా 30 రోజులు కాలవ్యవధితో ఉంటుంది. ఇది వర్క్, విజిట్, హజ్, ఉమ్రా వీసాలు నుండి స్వతంత్రంగా ఉంటుంది'' అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది కమిషన్స్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఉమర్ అల్-ముబారక్ తెలిపారు. టూరిస్ట్ వీసాలకు సంబంధించిన నిబంధనలు తుది రూపకల్పన జరిగాయని, ఈ నిబంధనలను 2018 తొలి క్వార్టర్లో ప్రకటించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర సమాచార సెంటర్, విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కలిసి టూరిస్ట్ వీసాల జారీ కోసం ఎలక్ట్రానిక్ సిస్టమ్ను కమిషన్ ఐటీ డిపార్ట్మెంట్ అభివద్ధి చేస్తుందని అల్-ముబాకర్ తెలిపారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







