మదీనాలో ఎటువంటి భూకంప నష్టం నమోదు కాలేదు
- January 16, 2018
మదీనా: స్వల్ప స్థాయిలో భూకంప అనుభవాన్ని మంగళవారం మదీనావాసులు చవి చూసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ భూకంప ప్రభావం కారణంగా ఎలాంటి నష్టాలూ లేవని భూకంప అప్రమత్తత మరియు పర్యావరణ పరిరక్షణ ప్రతినిధి తారీఖ అబల్ ఖైల్ ప్రకటించారు. ఉత్తరదక్షిణ ప్రాంతంలోని మదీనాకు14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం చాలా బలహీన స్థాయిలో ప్రమాదం కలుగని రీతిలో ఉందని వివరించారు. "నేషనల్ కమీషన్ ఫర్ భూకంప మరియు భూకంప పర్యవేక్షణ (ఇ సి సి) ప్రకంపన ఈ తీవ్రత రిక్టర్ స్కేల్ పై 2.5 డిగ్రీల పరిమాణంతో మంగళవారం మధ్యాహ్నం 2:59 సమయంలో రికార్డ్ కాబడింది. మరోవైపు, మాదినాలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ప్రతినిధి కల్లా ఖలేద్ అల్-జోహని మాట్లాడుతూ, సివిల్ డిఫెన్స్ వద్ద మార్గదర్శక కేంద్రం 3.00 గంటలకు భూకంప సమాచారం పొందింది మదీనా పశ్చిమాన ఉన్న పట్టణ ప్రాంతాల్లోని నివాసితుల భూకంప అనుభవం గూర్చి మంగళవారం పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిని నిర్ధారిస్తూ మదీనాలో భూకంపం సంభవించినట్లు భూకంపం రిక్టర్ స్కేల్పై 2.5 డిగ్రీల కొలత నమోదయిందని సౌదీ జియోలాజికల్ సర్వే సైతం ప్రకటించింది. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం అందుకోలేదని మదీనాలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్రహ్మాన్ అల్-హర్బీపేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







