సల్మానియా సిగ్నల్-జంక్షన్ వద్ద మూడురోజుల పాటు దారి మూసివేత
- January 16, 2018
మనామా: సల్మానియా మరియు కింగ్ అబ్దులాజిజ్ ప్రాంతాల సిగ్నల్-జంక్షన్ వద్ద ఒక ప్రాముఖ్యమైన ఉపరితల పనులను అమలు చేయనున్నట్లు పనులు మరియు పురపాలక వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు పట్టాన ప్రణాళిక శాఖ మంగళవారం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఒక మార్గ దశలో దారి మూసివేయబడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ కొనసాగింపు కోసం మరొక మార్గంలో దారి తెరవబడుతుందని మంత్రిత్వశాఖ సూచించింది. ఆ మార్గం మూసివేత గురువారం జనవరి 18 వ తేదీ రాత్రి 11:00 గంటల నుంచి ఆదివారం జనవరి 21 వ తేదీ ఉదయం 5 గంటల వరకు సమర్థవంతంగా అమలు చేయబడనుంది.ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నియమాలను గమనించి, అనుసరించాలని అందరు రహదారి వినియోగదారులను మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా కోరింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









