షేక్ జాయెద్ మెమోరియల్ జనవరి 22న ప్రారంభం
- January 18, 2018
యు.ఏ.ఈ:లేట్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం నిర్మిస్తోన్న మెమోరియల్ జనవరి 22న అబుదాబీలో అధికారిక కార్యక్రమం ద్వారా ప్రారంభం కానుంది. అధికారిక ప్రారంభోత్సవం అన్ని ప్రముఖ జాతీయ టీవీ ఛానల్స్లోనూ ఉదయం 9.3 నిమిషాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఇయర్ ఆప్ జాయెద్ - షేక్ జాయెద్ 100వ జయంతి నేపథ్యంలో ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. 2018 స్ప్రింగ్ నుంచి పబ్లిక్ ఈ మెమోరియల్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రముఖ నాయకుడైన షేక్ జాయెద్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు, మాటలు, ల్యాండ్స్కేపింగ్ సహా ఎన్నో ఆకర్షణలు ఈ మెమోరియల్లో పొందుపరిచారు. అబుదాబీలోని ఫస్ట్, సెకెండ్ ఇంటర్సెక్షన్ వద్ద 3.3 హెక్టార్లలో ఈ మెమోరియల్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









