షేక్‌ జాయెద్‌ మెమోరియల్‌ జనవరి 22న ప్రారంభం

- January 18, 2018 , by Maagulf
షేక్‌ జాయెద్‌ మెమోరియల్‌ జనవరి 22న ప్రారంభం

యు.ఏ.ఈ:లేట్‌ షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ జ్ఞాపకార్థం నిర్మిస్తోన్న మెమోరియల్‌ జనవరి 22న అబుదాబీలో అధికారిక కార్యక్రమం ద్వారా ప్రారంభం కానుంది. అధికారిక ప్రారంభోత్సవం అన్ని ప్రముఖ జాతీయ టీవీ ఛానల్స్‌లోనూ ఉదయం 9.3 నిమిషాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఇయర్‌ ఆప్‌ జాయెద్‌ - షేక్‌ జాయెద్‌ 100వ జయంతి నేపథ్యంలో ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. 2018 స్ప్రింగ్‌ నుంచి పబ్లిక్‌ ఈ మెమోరియల్‌ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రముఖ నాయకుడైన షేక్‌ జాయెద్‌కి సంబంధించి ముఖ్యమైన విషయాలు, మాటలు, ల్యాండ్‌స్కేపింగ్‌ సహా ఎన్నో ఆకర్షణలు ఈ మెమోరియల్‌లో పొందుపరిచారు. అబుదాబీలోని ఫస్ట్‌, సెకెండ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద 3.3 హెక్టార్లలో ఈ మెమోరియల్‌ని తీర్చిదిద్దారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com