గన్నవరం- ముంబయి విమానసేవలు ప్రారంభం
- January 18, 2018
రాజధాని వాసుల కల నెరవేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి విజయవాడ నుంచి నేరుగా రెండు గంటల్లో చేరిపోయేందుకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. గన్నవరం నుంచి ముంబయికి విమాన సేవలను కేంద్రం పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అమరావతి రాజధాని ప్రాంతం నుంచి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోయింగ్ 737-800 విమాన సేవలను ప్రారంభించింది. ముంబయికి చేరుకుంటే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా వెళ్లిపోయేందుకు అనుసంధానం ఉంటుంది. ఇదే సర్వీసును భవిష్యత్తులో దుబాయ్కు పొడిగించే యోచనలో ఎయిరిండియా ఉంది.
ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ విభాగాల ఏర్పాటు తుది దశకు చేరింది. గన్నవరం విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో ఈ రెండు విభాగాలకు అవసరమైన యంత్ర పరికరాలు, అంతర్జాతీయ అనుసంధానం కోసం అంతర్జాల కేబుళ్లను వేసే పని జరుగుతోంది. ఇది పూర్తయ్యాక.. ముంబయి సర్వీసు దుబాయ్కు ఎగరనుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటోంది. వీరందరికీ ఈ ముంబయి సర్వీసుతో ప్రయోజనం చేకూరనుంది. భారతదేశానికే గేట్వే లాంటి మహానగరం ముంబయి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకూ గంటకో విమాన సర్వీసు ఉంటుంది. విజయవాడ నుంచి నేరుగా ముంబయి విమానాశ్రయంలో దిగిపోతే.. అక్కడి నుంచి కనెక్టివిటీ విమాన సర్వీసును అందుకుని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లిపోయేందుకు మార్గం సుగమం అవుతుంది.
హాట్కేకుల్లా టిక్కెట్లు..
తొలి సర్వీసు ప్రారంభించగానే గురువారం మధ్యాహ్నానికే వంద మందికి పైగా టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. టిక్కెట్ ప్రారంభ ధర రూ.4500 నుంచి మొదలై.. గురువారం రాత్రికి రూ.8 వేల వరకూ చేరింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్ర, ఆది వారాలతో పాటు మంగళవారం కలిపి మూడు రోజులు ప్రస్తుతానికి ఈ సర్వీసు నడుస్తుంది. ఈ మూడు రోజుల్లో ఆక్యుపెన్షీ నిండిపోతే.. నిత్యం నడపాలనేది ఎయిరిండియా ప్రణాళిక. ప్రస్తుతం విజయవాడ నుంచి ముంబయికి రైలులో వెళ్లేందుకు 20 గంటలు, బస్సుల్లో వెళ్లేందుకు 19గంటలకు పైగా సమయం పడుతోంది. విమాన సర్వీసు అందుబాటులోనికి రావడంతో కేవలం 1.45గంటల్లో చేరుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ముంబయి సర్వీసుతో పాటూ దేశంలోని దిల్లీ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై మహా నగరాలకు గన్నవరం నుంచి అనుసంధానం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







