ప్రముఖ జానపద గాయకురాలి అదృశ్యం...శవమై తేలిన వైనం
- January 18, 2018
హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు మమత శర్మ అదృశ్యమై పొలాల్లో శవమై తేలిన ఘటన సంచలనం రేపింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకురాలు మమతశర్మ తన సహ గాయకుడు మోహిత్ కుమార్ తో కలిసి సోనిపట్ గోహానా పట్టణంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాటలు పాడేందుకు ఇంటి నుంచి వెళ్లింది. ఇంటినుంచి వెళ్లిన మమతశర్మను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రోహతక్ జిల్లా బనియాని గ్రామంలోని పొలాల్లో మమతశర్మ శవమై తేలింది. మమత అదృశ్యంపై తాము ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







