ప్రముఖ జానపద గాయకురాలి అదృశ్యం...శవమై తేలిన వైనం
- January 18, 2018
హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు మమత శర్మ అదృశ్యమై పొలాల్లో శవమై తేలిన ఘటన సంచలనం రేపింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకురాలు మమతశర్మ తన సహ గాయకుడు మోహిత్ కుమార్ తో కలిసి సోనిపట్ గోహానా పట్టణంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాటలు పాడేందుకు ఇంటి నుంచి వెళ్లింది. ఇంటినుంచి వెళ్లిన మమతశర్మను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రోహతక్ జిల్లా బనియాని గ్రామంలోని పొలాల్లో మమతశర్మ శవమై తేలింది. మమత అదృశ్యంపై తాము ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







