భారతీయ మహిళకు అత్యవసర వీసా

- January 19, 2018 , by Maagulf
భారతీయ మహిళకు అత్యవసర వీసా

దుబాయ్‌లో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకోసం భారతీయ మహిళ ఒకరికి అత్యవసర వీసా మంజూరయ్యింది. తన భర్త బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, మెడికల్‌ ఎమర్జన్సీ కోటాలో తనకు అత్యవసర వీసా మంజూరు చేయాలని, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కి గరిమా సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తన భర్త పరిస్థితిపై వరుస ట్వీట్లతో సుష్మా స్వరాజ్‌కి ఆమె మొరపెట్టుకున్నారు. బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి, అత్యవసర వీసా మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారిక వర్గాలు కేంద్ర మంత్రి ఆదేశాలతో గరిమాకి అత్యవసర వీసా మంజూరు చేశారు. అలాగే కాన్సులేట్‌ జనరల్‌ని అప్రమత్తం చేసి, దుబాయ్‌లో చికిత్స పొందుతోన్న గరిమా భర్తకి తగిన సహాయం అందించాల్సిందిగా సుష్మా స్వరాజ్‌ సూచించారు. కేంద్ర మంత్రి సూచనతో, కాన్సులేట్‌ ప్రతినిథులు, ఆసుపత్రికి వెళ్ళి, అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com