భారతీయ మహిళకు అత్యవసర వీసా
- January 19, 2018
దుబాయ్లో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకోసం భారతీయ మహిళ ఒకరికి అత్యవసర వీసా మంజూరయ్యింది. తన భర్త బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, మెడికల్ ఎమర్జన్సీ కోటాలో తనకు అత్యవసర వీసా మంజూరు చేయాలని, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కి గరిమా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన భర్త పరిస్థితిపై వరుస ట్వీట్లతో సుష్మా స్వరాజ్కి ఆమె మొరపెట్టుకున్నారు. బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి, అత్యవసర వీసా మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారిక వర్గాలు కేంద్ర మంత్రి ఆదేశాలతో గరిమాకి అత్యవసర వీసా మంజూరు చేశారు. అలాగే కాన్సులేట్ జనరల్ని అప్రమత్తం చేసి, దుబాయ్లో చికిత్స పొందుతోన్న గరిమా భర్తకి తగిన సహాయం అందించాల్సిందిగా సుష్మా స్వరాజ్ సూచించారు. కేంద్ర మంత్రి సూచనతో, కాన్సులేట్ ప్రతినిథులు, ఆసుపత్రికి వెళ్ళి, అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







