స్వల్పంగా పెరిగిన పసిడి ధర
- January 20, 2018
బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం.. నేడు కాస్త కోలుకుంది. రూ.20 పెరిగి తులం బంగారం ధర రూ.30,850కి చేరింది. శుక్రవారం నాటి బులియన్ మార్కెట్ లో పసిడి ధర రూ.120 తగ్గిన సంగతి తెలిసిందే. నేటి మార్కెట్ లో వెండి ధర కూడా బంగారం బాట పట్టింది. రూ.50 పెరిగి కేజీ వెండి ధర రూ.39,900కి చేరింది. దేశీయ మార్కెట్ లో బంగారం కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడంతో పసిడి ధర స్వల్పంగా పెరిగనట్టు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.270 తగ్గగా.. శనివారం రూ.20 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో 0.32శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1330 డాలర్లకు చేరింది. 0.38శాతం పెరిగి ఔన్సు వెండి ధర 17డాలర్లకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.30,850 ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల పసిడి ధర రూ.30,700కి చేరింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









