అవినీతిపై భారీ నిరసన చేసిన రుమేనియా
- January 21, 2018
బుఖారెస్ట్: దేశంలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న అవినీతిపై ప్రజలు భారీయెత్తున నిరసన తెలియచేసారు. ముఖ్యంగా ప్రభుత్వం కొత్తగా రూపొందించిన అవినీతి నిరోధక చట్టం ఉన్నత స్థాయి అవినీతిపరులను రక్షించటానికి ఉపయోగిస్తోందంటూ దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో భారీయెత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధికార సోషల్ డెమొక్రాట్స్ నేతృత్వంలోని ప్రభుత్వం గత నెలలో ఆమోదించిన కొత్త అవినీతి నిరోధకచట్టంతో ఉన్నత స్థాయిలో అవినీతిపరులను ప్రాసిక్యూట్ చేసి శిక్షించటం కష్టసాధ్యమవుతుందని విమర్శకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును విమర్శిస్తున్న వారిలో ఒకరైన అధ్యక్షుడు దీనిపై ఇంకా సంతకం చేయాల్సి వుంది. రాజధాని బుఖారెస్ట్లో యూనివర్శిటీ స్క్వేర్నుండి పార్లమెంట్ భవనం వరకూ సాగిన నిరసన ప్రదర్శనలో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. బుఖారెస్ట్తో పాటు క్లజ్, తిమిసోరా, కాన్స్టాంటా, బకావ్, సిబియు, లాసి తదితర నగరాలలో సైతం నిరసన ప్రదర్శనలు జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









