అవినీతిపై భారీ నిరసన చేసిన రుమేనియా
- January 21, 2018
బుఖారెస్ట్: దేశంలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న అవినీతిపై ప్రజలు భారీయెత్తున నిరసన తెలియచేసారు. ముఖ్యంగా ప్రభుత్వం కొత్తగా రూపొందించిన అవినీతి నిరోధక చట్టం ఉన్నత స్థాయి అవినీతిపరులను రక్షించటానికి ఉపయోగిస్తోందంటూ దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో భారీయెత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధికార సోషల్ డెమొక్రాట్స్ నేతృత్వంలోని ప్రభుత్వం గత నెలలో ఆమోదించిన కొత్త అవినీతి నిరోధకచట్టంతో ఉన్నత స్థాయిలో అవినీతిపరులను ప్రాసిక్యూట్ చేసి శిక్షించటం కష్టసాధ్యమవుతుందని విమర్శకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును విమర్శిస్తున్న వారిలో ఒకరైన అధ్యక్షుడు దీనిపై ఇంకా సంతకం చేయాల్సి వుంది. రాజధాని బుఖారెస్ట్లో యూనివర్శిటీ స్క్వేర్నుండి పార్లమెంట్ భవనం వరకూ సాగిన నిరసన ప్రదర్శనలో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. బుఖారెస్ట్తో పాటు క్లజ్, తిమిసోరా, కాన్స్టాంటా, బకావ్, సిబియు, లాసి తదితర నగరాలలో సైతం నిరసన ప్రదర్శనలు జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









