దోహా-కతర్ బిషప్ గా ఆంధ్రా వాసి

- January 21, 2018 , by Maagulf

 

కతర్:దోహా-కతర్ లో ఉంటున్న రాజోలు దీవి వాసి ఓగూరి బుల్లబ్బాయి బిషప్ గా బాధ్యతలు స్వీకరించారు.సఖినేటిపల్లి మండలం మొరికి చెందిన బుల్లబ్బాయి శనివారం కతర్లో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.కతర్ లోని తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుల్లబ్బాయిని ఘనం సన్మానించారు.కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ కతర్ లో తెలుగు వారైనా బుల్లబ్బాయికి అరుదైన గౌరవం దక్కడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో హైకోర్ట్ న్యాయవాది నల్లి పెద్దిరాజు,ఎన్నారై తెలుగు కమ్యూనిటీ సభ్యులు డాక్టర్ గెద్దాడ నాగేశ్వర రావు ,ఈద సంజీవ రావు,బందెల ఏసన్ బాబు,బత్తిన రత్నరాజ్,ఈద కిశోరె ,అడిదల కుమార్ రత్నం,వైస్సార్సీపీ నాయకుడు సార్ల విజయప్రసాద్ అధిక సంఖ్యలో తెలుగు ఎన్నారై పాల్గొన్నారు.

--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com