మత సామరస్యానికి ప్రతీక.. దర్గాలో వసంత పంచమి వేడుక
- January 21, 2018
వసంత పంచమి వేడుకలను హిందువులు జరుపుకోవడం మామూలే. మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదర, సోదరీమణులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం దేశ రాజధాని ఢిల్లీలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది ఏదో ఒకటీ రెండు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం కాదు. దాదాపు ఏడువందల సంవత్సరాలుగా ఈ వేడుకల్ని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో సూఫీ వసంత పంచమి వేడుకలు జరుగుతాయి. అయితే అదే స్ఫూర్తితో మన హైదరాబాదులోని ఓ దర్గాలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ సమీప పత్తర్ గట్టీ ఉర్దూ గల్లీలోని హజ్రత్ షేక్జీ హలీ అబుల్ ఉలాయి దర్గాలో ఈ వేడుకలు జరుగుతాయి. తొలిసారి ఈ వేడుకలు 2015లో జరిగాయి. దర్గా హాలులో కనువిందు చేసే విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది.
అసలు 12వ శతాబ్దంలోనే ముస్లింలు ఈ వసంత పంచమి వేడుకల్ని జరుపుకోవడం ఆరంభమైంది. ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రధాన కారణం ముస్లిం మత గురువైన నిజాముద్దీన్, మేనల్లుడి హఠాన్మరణంతో దిగులు చెందుతున్నాడు. అతడిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి అమీర్ ఖుస్రో ఈ వేడుకల్ని నిర్వహించారట. మన దేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా సూఫీ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా అమీర్ ఖుస్రో వసంత పంచమి, సంగీత వాయిద్యాలపై రాసిన కవితలు, పాటలు భాగ్యనగరంలోని పత్తర్గట్టీ దర్గాలో ఆలపిస్తారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







