మత సామరస్యానికి ప్రతీక.. దర్గాలో వసంత పంచమి వేడుక
- January 21, 2018వసంత పంచమి వేడుకలను హిందువులు జరుపుకోవడం మామూలే. మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదర, సోదరీమణులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం దేశ రాజధాని ఢిల్లీలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది ఏదో ఒకటీ రెండు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం కాదు. దాదాపు ఏడువందల సంవత్సరాలుగా ఈ వేడుకల్ని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో సూఫీ వసంత పంచమి వేడుకలు జరుగుతాయి. అయితే అదే స్ఫూర్తితో మన హైదరాబాదులోని ఓ దర్గాలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ సమీప పత్తర్ గట్టీ ఉర్దూ గల్లీలోని హజ్రత్ షేక్జీ హలీ అబుల్ ఉలాయి దర్గాలో ఈ వేడుకలు జరుగుతాయి. తొలిసారి ఈ వేడుకలు 2015లో జరిగాయి. దర్గా హాలులో కనువిందు చేసే విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది.
అసలు 12వ శతాబ్దంలోనే ముస్లింలు ఈ వసంత పంచమి వేడుకల్ని జరుపుకోవడం ఆరంభమైంది. ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రధాన కారణం ముస్లిం మత గురువైన నిజాముద్దీన్, మేనల్లుడి హఠాన్మరణంతో దిగులు చెందుతున్నాడు. అతడిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి అమీర్ ఖుస్రో ఈ వేడుకల్ని నిర్వహించారట. మన దేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా సూఫీ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా అమీర్ ఖుస్రో వసంత పంచమి, సంగీత వాయిద్యాలపై రాసిన కవితలు, పాటలు భాగ్యనగరంలోని పత్తర్గట్టీ దర్గాలో ఆలపిస్తారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..