మత సామరస్యానికి ప్రతీక.. దర్గాలో వసంత పంచమి వేడుక
- January 21, 2018
వసంత పంచమి వేడుకలను హిందువులు జరుపుకోవడం మామూలే. మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదర, సోదరీమణులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం దేశ రాజధాని ఢిల్లీలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇది ఏదో ఒకటీ రెండు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం కాదు. దాదాపు ఏడువందల సంవత్సరాలుగా ఈ వేడుకల్ని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో సూఫీ వసంత పంచమి వేడుకలు జరుగుతాయి. అయితే అదే స్ఫూర్తితో మన హైదరాబాదులోని ఓ దర్గాలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ సమీప పత్తర్ గట్టీ ఉర్దూ గల్లీలోని హజ్రత్ షేక్జీ హలీ అబుల్ ఉలాయి దర్గాలో ఈ వేడుకలు జరుగుతాయి. తొలిసారి ఈ వేడుకలు 2015లో జరిగాయి. దర్గా హాలులో కనువిందు చేసే విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది.
అసలు 12వ శతాబ్దంలోనే ముస్లింలు ఈ వసంత పంచమి వేడుకల్ని జరుపుకోవడం ఆరంభమైంది. ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రధాన కారణం ముస్లిం మత గురువైన నిజాముద్దీన్, మేనల్లుడి హఠాన్మరణంతో దిగులు చెందుతున్నాడు. అతడిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి అమీర్ ఖుస్రో ఈ వేడుకల్ని నిర్వహించారట. మన దేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా సూఫీ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా అమీర్ ఖుస్రో వసంత పంచమి, సంగీత వాయిద్యాలపై రాసిన కవితలు, పాటలు భాగ్యనగరంలోని పత్తర్గట్టీ దర్గాలో ఆలపిస్తారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు