'ఫస్ట్లేడీ' అవార్డు అందుకున్న ఐష్!
- January 22, 2018
'ఫస్ట్లేడీ' అవార్డు అందుకున్న ఐష్!
ముంబయి: అందాలరాశి ఐశ్వర్య రాయ్ 'ఫస్ట్లేడీ' అవార్డును అందుకున్నారు. శనివారం రాత్రి దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 'ఫస్ట్లేడీస్' అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్రపరిశ్రమలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న మాజీ మిస్ వరల్డ్ ఐష్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మొట్టమొదటి మహిళలకు ఈ ఫస్ట్లేడీ అవార్డులు అందజేస్తారు.
ప్రముఖ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన ఏకైక భారతీయ నటి ఐశ్వర్య రాయ్. ఇందుకు గానూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ.. ఐష్ను సత్కరించారు. 2002 నుంచి ఐష్ ఏటా ఫ్రాన్స్లో జరిగే కేన్స్ వేడుకకు హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమంలో తొలి మహిళా రిక్షా డ్రైవర్ షీలా దవారే, అతి చిన్న వయసులో పైలట్ అయిన ఆయేషా అజీజ్, కశ్మీర్కి చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి రువేదా సలామ్లతో కలిపి 112 మంది మహిళలు ఈ అవార్డును దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఐష్ 'ఫ్యాన్ ఖాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, రాజ్కుమార్ రావ్ కథానాయకులు. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







