ఫిబ్రవరి 11 వ తేదీ వరకు తన వినియోగదారులకు ఊరెడూ ప్రత్యేక ఆఫర్లు
- January 22, 2018
మస్కట్ : ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ను ఆస్వాదించాలని పలువురు వినియోగదారులకు ఊరెడూ విలువ-ఆధారిత ఆఫర్లను ప్రారంభించింది. మస్కట్ లోని తన వినియోగదారుల కోసం ఎక్కువ కాల వ్యవధితో కూడిన మరింత డేటా పొదుపు మరియు వినోదాలతో ఊరెడూ అందిస్తుంది. షాహ్రీ మరియు షబాబియా గృహ బ్రాడ్ బ్యాండ్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యాప్ ద్వారా కంపెనీ జనవరి 18 వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వ తేదీ వరకు డిజిటల్ ప్రకృతి దృశ్యాలు పంపించనుందని ఒక పత్రికా ప్రకటనలో ఊరెడూ కంపెనీ తెలిపింది. పండుగ కాలంలో, ఊరెడూ ఒమన్ లోని తన వినియోగదారులఅందరికి ప్రతి రీచార్జ్ తో అదనపు 20, 50 మరియు 100 ఎం బి పి ఎస్ ప్లాన్ యొక్క సూపర్ ఫాస్ట్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ అందచేయబడుతుంది. చందాదారులు కూడా అదే ఫీజు తో వేగంతో కూడిన అధిక ఇంటర్నెట్ మూడు నెలల పాటు పొందుకోగలుగుతారు. అదేవిధంగా మౌసబక్ మరియు షబాబుయ్య వినియోగదారులు నిరాశ చెందనవసరం లేదు. వాటిని ప్రతి 5 రియల్ ఒమాన్ లేదా 10 రియల్ ఒమాన్ రీఛార్జ్ తో పూర్తిగా ఉచిత 9 జి బి వరకు అదనపు డేటా లభించనుంది. ఊరెడూ వినియోగదారుల విక్రయాల డైరెక్టర్ ఫెరస్ బిన్ అబ్దుల్లా అల్ షేక్ మాట్లాడుతూ, "ఒమన్ క్యాలెండర్ లో ముఖ్యమైన కార్యక్రమాలలో మస్కట్ ఉత్సవం ప్రధానమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 24 రోజులపాటు వినోదంతో కూడిన కార్యకలాపాలను ఆస్వాదించేందుకు లక్షలాదిమందికి అవకాశమిచ్చింది. అంతకు ముందు సంవత్సరాలలో సైతం ఈ పండుగ కాలంలో మా వినియోగదారులకు ఎదురులేని ఆఫర్ల కు ఆతిధ్యం అందించేందుకు మేము గర్వపడుతున్నాం. ఎక్కువ కనెక్టివిటీ, విలువ మరియు డేటాతో ఊరెడూను శక్తివంతం చేయడానికి ఇది ఒక అవకాశంగా మలుచుకొంటున్నాం."
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..







