సౌదీలో రాజవంశీకుల అరెస్టుల దెబ్బకు ...అవినీతి సొమ్ము ఖజానాకు చేరుతోంది
- January 23, 2018
రియాధ్ : ధనికులను కాపాడి.. పేదోళ్ల పై పన్నుల భారాన్ని మొపరక్కడ ..చట్టం ముందు సామాన్యుడైన సుల్తాన్ అయినా ఒకటే అని పలు సంఘటనలు ఇటీవల సౌదీ అరేబియా జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన రాజకుటుంబీకుల అరెస్టులను ఆ దేశ పౌరులనే కాక యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. దేశంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారనే కారణాలతో సుమారు 95 మంది మంత్రులు, వ్యాపారవేత్తలు, రాజకుటుంబీకులను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్ట్ చేయించి సంచలనం కల్గించారు.వారందరినీ రాత్రికి రాత్రే అరెస్ట్ చేయించి ఓ అత్యాధునిక ప్యాలెస్లో రహస్యంగా బంధించి వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రత్యేక విచారణ జరిపేరు అయితే ఆ అరెస్టుల ఫలితంగా సౌదీ ప్రభుత్వానికి ఏకంగా 124 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిపడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అత్యధికులు .. ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి ఆదాయంలో కొంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించి ఆ చెర నుంచి విడుదల అవుతున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది రాజవంశీకులు, వ్యాపారవేత్తలు విడుదలయ్యారు. ఇలా ఇప్పటివరకు విడుదలయిన వారు చెల్లించిన మొత్తం అక్షరాలా 124 బిలియన్ డాలర్లని ( మనదేశ కరెన్సీ లో ఏడు లక్షల 91వేల 430 కోట్ల రూపాయలు) అధికారులు ఆఫ్ ధీ రికార్డుగా గుస గుసలాడుకొంటున్నారు. . ఈ నెలాఖరు వరకు నిందితులతో చర్చలు జరిపుతుందనీ, ఆ సమయానికి ఆర్థిక నేరాలను అంగీకరించకపోతే కఠిన శిక్షలు విధిస్తామని చెబుతున్నారు. అవినీతి విషయంలో సౌదీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది యువరాజు సల్మాన్ అంతిమ లక్ష్యమట. దాంతో అక్రమాలు చేసి సంపాదించిన పలువురు ధనికులు గజ గజ వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







